AP Assembly election Lok Sabha 2024 Phase 4 Polling LIVE: ముగిసి పోలింగ్, ఓటేసిన పొలిటికల్, సినీ స్టార్స్ వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలు 4వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం :దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గవ దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.నాల్గవ దశ పోలింగ్‌లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. గత రెండు నెలలుగా ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు శనివారంతో ముగింపు పలికాయి. ఇక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాల్గవ దశలో మే 13వ తేదీన మొత్తంగా 10 రాష్ట్రాల నుంచి 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

నాల్గవ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సమయాలను ఇప్పటికే ఈసీ విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. మిగతా ప్రాంతాల్లో 6 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలింగ్‌కు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Andhra Pradesh assembly election and telangana Lok Sabha Election 2024 phase 4 polling live in telugu

May 13, 2024, 11:13 pm IST

సోమవారం సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం అర్దరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.
May 13, 2024, 11:12 pm IST

1996 తర్వాత జాతీయ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం.
May 13, 2024, 11:12 pm IST

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పంచుకున్న గణాంకాల ప్రకారం.. సాయంత్రం 5 గంటలకు 62.3% ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.66%, మధ్యప్రదేశ్‌లో 68.01% పోలింగ్ శాతం నమోదైంది.
May 13, 2024, 10:11 pm IST

సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్‌ నమోదైంది. 96 నియోజకవర్గాల్లో 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
May 13, 2024, 9:07 pm IST

ఇక దేశ వ్యాప్తంగా 96 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి.
May 13, 2024, 8:48 pm IST

ఏపీలో 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో ఇప్పటి వరకు పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.
May 13, 2024, 7:48 pm IST

గతంలో కంటే ఏపీలో ఎక్కువ పోలింగ్ నమోదైందని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా.
May 13, 2024, 7:43 pm IST

ఏపీలో ఎక్కడా కూడా రీపోలింగ్ అవకాశం లేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రేపటి వరకు దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
May 13, 2024, 7:36 pm IST

ఏపీలో ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద మొత్తంలో ఓటింగ్ నమోదైందని మీనా వెల్లడించారు.
May 13, 2024, 7:35 pm IST

11 చోట్ల ఈవీఎంలను ద్వంసం చేశారని, వాటిని మార్చి పోలింగ్ నిర్వహించినట్లు మీనా తెలిపారు.
May 13, 2024, 7:34 pm IST

పల్నాడులోని ఒక చోట ఈవీఎంను ద్వంసం చేశారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే, ఈవీఎంలోని చిప్ డేటా భద్రంగా ఉందన్నారు.
May 13, 2024, 7:09 pm IST

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు వికాస్ రాజ్. రీపోలింగ్ లాంటివి ఏవైనా ఉంటే రేపటి వరకు చెబుతామన్నారు.
May 13, 2024, 7:07 pm IST

ఈ రోజు రాత్రి లేదంటే రేపటి వరకు పోలింగ్ శాతంపై పూర్తి స్పష్టత వస్తుందని వికాస్ రాజ్ తెలిపారు.
May 13, 2024, 7:06 pm IST

ఈరోజు 38 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు వికాస్ రాజ్ తెలిపారు.
May 13, 2024, 7:02 pm IST

సోమవారం రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
May 13, 2024, 6:44 pm IST

వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణ పడటంతో పెనమలూరులో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
May 13, 2024, 6:07 pm IST

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
May 13, 2024, 6:02 pm IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాస్ట్రాల్లో ముగిసిన పోలింగ్.
May 13, 2024, 6:02 pm IST

సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం.
May 13, 2024, 5:57 pm IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 67.4 శాతం పోలింగ్ నమోదైంది.
May 13, 2024, 5:29 pm IST

హిందూపురంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర.
May 13, 2024, 5:26 pm IST

జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు.
May 13, 2024, 4:49 pm IST

ప్రత్తిపాడు పరిధి పల్లపాడులో పోలింగ్‌ బూత్‌ 152లో నత్తనడకన సాగుతున్న పోలింగ్‌
May 13, 2024, 4:42 pm IST

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో మహేశ్‌బాబు దంపతులు
May 13, 2024, 4:40 pm IST

ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.
May 13, 2024, 4:25 pm IST

అమరచింత జడ్పీ హైస్కూల్‌లో 2గంటలుగా పనిచేయని ఈవీఎం.
May 13, 2024, 4:15 pm IST

సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది
May 13, 2024, 4:07 pm IST

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది.
May 13, 2024, 4:03 pm IST

ఏపీలో మధ్యాహ్నం 3గంటల వరకు 55.49శాతం పోలింగ్‌ నమోదు.
May 13, 2024, 3:44 pm IST

పాడేరులో భారీ వర్షం, ఓటర్లకు తప్పని ఇబ్బందులు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+