జగన్ సర్కారు మరో రికార్డు.. కరోనా టెస్టుల్లో 10 లక్షల మైలురాయి.. ఇప్పటిదాకా ఈ రాష్ట్రాలు మాత్రమే..
కరోనా కట్టడి చర్యల విషయంలో ఇప్పటకే కేంద్రం, వివిధ ప్రఖ్యాత సంస్థల నుంచి అభినందనలు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. కొవిడ్-19 టెస్టుల్లో ఆదివారం నాటికి 10లక్షల మైలురాయిని దాటేసింది. దేశంలో ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు మాత్రమే 10 లక్షల పైచిలుకు టెస్టులు చేయగా, ఇప్పుడా జాబితాలోకి ఏపీ కూడా చేరింది.
చంద్రబాబు క్రిమినల్ మాఫియా 1990 చిప్.. జగన్ పరివార్ వైరస్ చిప్.. కొల్లు అరెస్టుపై డైలాగ్ వార్..
టాప్-3 రాష్ట్రాలివే..
కరోనా కేసులకు సంబంధించి మహారాష్ట్ర(2లక్షల పైచిలుకు), తమిళనాడు(1.11లక్షలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్(18,697) పదో స్థానంలో నిలిచింది. అయితే టెస్టుల్లో మాత్రం ఏపీ సత్తాను చాటుకుంది. ఆదివారం నాటికి కొవిడ్ టెస్టుల పరంగా తమిళనాడు టాప్ లో నిలిచింది. అక్కడ మొత్తం 13.06లక్షల టెస్టులు నిర్వహించారు. మహారాష్ట్రలో మొత్తం 10.85 లక్షల టెస్టులు చేపట్టారు. మొత్తం 10.17లక్షల టెస్టులతో ఏపీ మూడో స్థానానికి చేరుకుంది. ఈ మూడు రాష్ట్రాల తర్వాత దేశరాజధాని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ లో అత్యధిక టెస్టులు చేపట్టారు.
సేఫ్ పొజిషన్లో ఏపీ..
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన ముందు చూపు వల్లే కొవిడ్-19 టెస్టుల్లో 1మిలియన్ మార్కును దాటగలిగామంటూ వైసీపీ నేతలు అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనడానికి కరోనా టెస్టులే ఉదాహరణ. ప్రపంచమంతా కొవిడ్-19కు భయపడుతుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం రాబోయే నష్టాన్ని ముందే ఊహించి వీలైనంత ఎక్కువ టెస్టులు చెయ్యడం వల్లే మనం సేఫ్ పొజిషన్ లో ఉన్నాం'' అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
ఎలా సాధ్యమైందంటే..
ఏపీలో కరోనా టెస్టులు 10 లక్షల మార్కు దాటడంపై మంత్రులు, వైసీపీ నేతలు స్పందించారు. ఇంటింటికీ వెళ్లి టెస్టులు నిర్వహించడం, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, అన్నింటికంటే ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థ పని తీరు, ఇంటింటి సర్వేలు.. లాంటి వినూత్న చర్యల ద్వారా ఏపీ 1మిలియన్ మైలురాయిని చేరుకుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ఏపీ సర్కారు చేపట్టిన బహుళ ప్రయత్నాలు ఫలితాలనిచ్చాయని, రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా టెస్టులు చేపడతామని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు.
Recommended Video
పరారీలో వైసీపీ నేత పీవీపీ.. బెజవాడలో హైదరాబాద్ పోలీసుల గాలింపు.. అంతలోనే సంచలన ట్వీట్లు..