ఆ డబ్బంతా ఏమైంది: 14 నెలల్లో ఏపీకి 63వేల కోట్ల కేటాయింపు, 23వేల కోట్లు విడుదల
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి తిరుపతిలో అత్మబలిదానం చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వారి సంఖ్య పెరిగింది. దీంతో ఏపీకి ఏదో ఒకటి చేయక తప్పని పరిస్ధితి కేంద్రానికి ఎదురైంది.
దీంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీని రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృషిపెట్టింది. ఇందులో భాగంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో ఏపీకి కేటాయించిన నిధుల లెక్కలను బయటకు తీస్తోంది. ఆయా శాఖల వారీగా నివేదికలను తెపించుకున్న ఆర్థిక శాఖ, ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులపై ఒక నివేదికను రూపొందించింది.

ఆ నివేదికను ఆర్ధిక శాఖ, పీఎంఓకు అందజేసింది. ఈ నివేదిక ప్రకారం గడచిన 14 నెలల కాలంలో ఏపీకి మొత్తం రూ.63,833.09 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చింది. అందులో రూ.23,843.21 కోట్లను ఇప్పటికే విడుదల చేశామని కూడా ఆ శాఖ లెక్కలు బయటకు తీసింది.
ఈ మొత్తం ప్రతి ఏటా పన్నుల వాటాలో భాగంగా వచ్చే నిధులకు అదనమని కేంద్రం పేర్కొంది. ఏపీకి ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో కేటాయించిన మొత్తంగా కేంద్రం చెబుతోంది. అయితే ఆర్ధిక శాఖ వద్ద ఉన్న నివేదికలో ఏపీకి ఏయే శాఖలకు ఎంతెంత కేటాయించిందో దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.













Click it and Unblock the Notifications