దేశంలో క్రైంరేటులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే.. తాజా ఎన్సీఆర్బీ నివేదిక వివరాలివే!!
దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న నేరాలపై నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో తాజాగా నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో సైబర్ నేరాలలో, మానవ అక్రమ రవాణాలో, ఆహార కల్తీలో తెలంగాణ రాష్ట్రం టాప్ వన్ లో ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం 2021లో దేశవ్యాప్తంగా జరిగిన నేరాలలో పదవ స్థానంలో ఉంది. 2020లో నేరాల రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 2021లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన నేరాలు రాష్ట్రంలో ఐదు శాతం తగ్గాయి . 2021 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపిసి కింద 1,79,611 నేరాలు మరియు ప్రత్యేక మరియు స్థానిక చట్టాల కింద 42,588 నేరాలు నమోదయ్యాయి. మొత్తం మీద దేశంలో నమోదైన నేరాలలో రాష్ట్రం 4.9% నేరాలను నమోదు చేసింది.
మహిళలపై నేరాల్లో ఏపీది 10వ స్థానం
2020
తో
పోలిస్తే
2021
లో
3.8
శాతం
మహిళలపై
నేరాలు
పెరిగాయని
ఎన్సిఆర్బి
నివేదిక
పేర్కొంది.
మహిళలపై
నేరాల
విషయంలో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
పదవ
స్థానంలో
ఉందని
వెల్లడించింది.
2021లో
మహిళలపై
17,752
కేసులు
నమోదయ్యాయి.
ఇకగత
ఏడాది
2020లో
17,089
కేసులు
నమోదయ్యాయి.
గతేడాది
1118
అత్యాచార
కేసులు
నమోదయ్యాయి.
2021లో
మొత్తం
1204
అత్యాచార
కేసులు
నమోదు
కాగా
బాధితుల్లో
614
మంది
18
ఏళ్ల
లోపు
మైనర్
లే
కావడం
గమనార్హం.
2021లో ఏపీలో పెరిగిన హత్య కేసులు
ఇక
రాష్ట్రంలో
హత్య
కేసులు
కూడా
స్వల్పంగా
పెరుగుతున్న
పరిస్థితి
కనిపిస్తుంది.
2021లో
మొత్తం
956
హత్యలు
నమోదుకాగా,
2020లో
హత్యల
సంఖ్య
853
గా
నమోదయింది.
ఎన్
సీ
ఆర్
బీ
డేటా
ప్రకారం
ఆస్తి
తగాదాలు,
కుటుంబ
సమస్యలు,
ఆర్థిక
లావాదేవీలు,
జలవివాదాలు
2021లో
ఎక్కువ
హత్యలకు
కారణం
అయినట్టు
ఎన్సిఆర్బి
నివేదిక
పేర్కొంది.
ఇక
2020లో
2648
కేసులు
నేరాలు
చేసిన
చిన్నారులపై
నమోదైన
కేసులు
కాగా
2021లో
2669
కేసులు
చిన్నారులపై
నమోదయినట్లు
తెలుస్తోంది
.
ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో ఏడో స్థానంలో ఏపీ
ఇక
ఎస్సీల
పై
3.28
శాతం,
ఎస్టీలపై
12
శాతం
దాడులు
పెరిగాయని,
దళితులు
గిరిజనులపై
జరుగుతున్న
దాడులలో
ఆంధ్రప్రదేశ్
ఏడో
స్థానంలో
నిలిచిందని
ఎన్సిఆర్బి
నివేదిక
పేర్కొంది.
ఇక
పోలీసులు
చట్టాలు
ఉల్లంఘిస్తున్న
కేసులలో,
పోలీసులే
నేరాలకు
పాల్పడుతున్న
కేసులలో
ఆంధ్రప్రదేశ్
ఐదవ
స్థానంలో
ఉంది.
దళిత
మహిళల
ఆత్మగౌరవానికి
భంగం
కలిగించిన
ఘటనల్లో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
దేశంలోనే
తొలి
స్థానంలో
ఉండగా
ఎస్టీలపై
నేరాల
రేటులో
5వ
స్థానంలో
నిలిచింది
ఆంధ్ర
ప్రదేశ్.
రాష్ట్రంలో
వైసీపీ
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
దళితులు,
గిరిజనుల
పై
నేరాలు
గణనీయంగా
పెరిగాయి
అని
తెలుగుదేశం
పార్టీతో
పాటు
ప్రతిపక్ష
పార్టీలు,
వైసీపీ
ప్రభుత్వాన్ని
ఎన్సీఆర్బీ
తాజా
నివేదిక
నేపథ్యంలో
టార్గెట్
చేస్తున్నాయి.
దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసుల్లో ఏపీది మొదటి స్థానం
ఆంధ్రప్రదేశ్లో
హత్యలు,
అత్యాచారాలు
కూడా
విపరీతంగా
పెరిగాయి
.
తాజాగా
2021
అత్యాచారాలు
8.49
శాతం
పెరిగినట్టు
కనిపిస్తోంది.
ఇక
కస్టడీ
మరణాలు
అత్యధికంగా
జరిగిన
రాష్ట్రాలలో
ఆంధ్రప్రదేశ్
మూడవ
స్థానంలో
ఉంది.
2021లో
మధ్యప్రదేశ్,
మహారాష్ట్రల్లో
6
కస్టడీ
మరణాలు
చోటుచేసుకోగా
ఏపీలో
5
మరణాలు
చోటుచేసుకున్నాయి.
ఇక
దళిత
మహిళల
ఆత్మ
గౌరవానికి
భంగం
కలిగించిన
కేసులలో
ఏపీ
మొదటి
స్థానంలో
ఉంది.
దేశవ్యాప్తంగా
దళిత
మహిళలపై
చోటుచేసుకున్న
దాడులు
150
కేసులు
కాగా,
అందులో
83
కేసులు
ఏపీ
లోనే
ఉండడం
గమనార్హం