Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పండగ వేళ- ఏపీకి కేంద్రం భారీ వరం- రూ. 4,112 కోట్లు విడుదల

పండగ సీజన్ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అదనంగా 1,01,603 కోట్ల రూపాయల పన్ను మొత్తాన్ని విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సిన సాధారణ నెలవారీ నిధులకు ఈ మొత్తం అదనం. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ కేటాయింపుల్లో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా వాటా దక్కింది. ఏకంగా 18,227 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లభించాయి. ఈ జాబితాలో బీహార్‌ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 10,219 కోట్ల రూపాయలు బీహార్ కు అందాయి. నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రం ఇది. ఈ నేపథ్యంలో 10,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను బీహార్ కు సమకూర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Andhra Pradesh Receives Significant Rs 4 112 Crore from New Tax Devolution

మధ్యప్రదేశ్‌- రూ.7,976 కోట్లు, పశ్చిమ బెంగాల్‌- రూ. 7,644 కోట్లు, మహారాష్ట్ర- 6,418 కోట్లు, రాజస్థాన్‌- రూ. 6,123 కోట్లు అందాయి. ఈ ఆరు రాష్ట్రాల తర్వాత ఏపీ నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి 4,112 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.

తెలంగాణకు రూ.2,136 కోట్ల రూపాయలు నిధులు అందాయి. ఉత్తరాఖండ్- రూ.1,136 కోట్లు, ఒడిశా- రూ. 4,601 కోట్లు, తమిళనాడు- రూ. 4,144 కోట్లు, కర్ణాటక- రూ.3,705 కోట్లు, జార్ఖండ్‌- రూ.3,360 కోట్లు అదనపు పన్నుల వాటాగా అందుకున్నాయి. ఛత్తీస్‌గఢ్- రూ.3,462 కోట్లు, గోవా- రూ.392 కోట్లు, గుజరాత్- రూ.3,534 కోట్లు, హర్యానా- రూ.1,111 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ.843 కోట్లు, కేరళ- రూ.1,956 కోట్లు, మణిపూర్- రూ.727 కోట్లు, మేఘాలయ- రూ.779 కోట్లు, మిజోరం- రూ.508 కోట్లు, నాగాలాండ్- రూ.578 కోట్లు లభించాయి.

రెండు రోజుల కిందటే చంద్రబాబు.. ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధుల విడుదల గురించి మాట్లాడారు. వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+