టిడిపికి కౌంటర్: మోఢీతో భేటీపై జగన్ కు మద్దతుగా టిడిపిని ఏకేసిన సోము వీర్రాజు

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కావడంపై టిడిపి , బిజెపి నేతల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. బిజెపి నేతలు వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని సమర్థించు

కాకినాడ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కావడంపై టిడిపి , బిజెపి నేతల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. బిజెపి నేతలు వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని సమర్థించుకొన్నారు.

మోడీ జగన్ భేటీపై టిడిపి వ్యాఖ్యలకు బీజేపీ నేత సోము వీర్రాజు గట్టిగానే సమాధానమిచ్చారు. వైసీపీ అధినేత జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ప్రశ్నించే అధికారం టిడిపికి చెందిన మంత్రులకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

Andhrapradesh Bjp leader Somu Veerraju slams on Tdp leaders

టిడిపి నేతలపై సోమువీర్రాజు విరుచుకపడ్డారు. జగన్ ప్రధానిని కలవడంపై మంత్రులు విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేశంలో అనేక మంది రాజకీయనాయకులపై సీబీఐ కేసులున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే అలాంటివారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం బీజేపీ లక్ష్యం కాదన్నారు. అయితే వైసీపీకి కేబినేట్ హోదా ఉన్న పిఎసి చైర్మెన్ పదవిని ఎందుకు ఇచ్చాని ఆయన ప్రశ్నించారు. విధానాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన చెప్పారు. జగన్ రాష్ట్రపతిని కూడ కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+