తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారభద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతుందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు మరియు విశాఖపట్నంలలో ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గుంటూరు, విశాఖపట్నంలలో ఆహార పరీక్షల ల్యాబ్ లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార నాణ్యత పరీక్షల కోసం సదుపాయాల కొరత ఉండడంతో, ఆహార నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వస్తుందని, అయితే ఇకపై తిరుమలలో ఏర్పాటు చేసిన నమూనా ఆధారంగా గుంటూరు, విశాఖపట్నంలలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త ల్యాబ్ లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

త్వరలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్స్ ఏర్పాటు
ఈ ల్యాబ్ లు ఎన్ ఎ బి ఎల్ ప్రమాణాలతో పనిచేసేలా ఏర్పాటు చేయబడతాయి అని ఆయన అన్నారు.విశాఖపట్నం, గుంటూరులో ల్యాబ్ లు త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ కేంద్రాలలో ఆహార నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఆహార భద్రతతో పాటు, ప్రజల ఆరోగ్య రక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు.
తిరుమల తరహాలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్ లు
తిరుమలలో ఏర్పాటుచేసిన ల్యాబ్ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 24గంటలు పనిచేసే విధంగా రూపొందించారని దీంతో ముడిసరుకుల నాణ్యత తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ల్యాబ్ లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, ఇదే తరహాలో గుంటూరు, విశాఖపట్నం ల్యాబ్ లను సైతం అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తామన్నారు. ఈ ల్యాబ్ ల స్థాపనతో రాష్ట్రంలో కల్తీఆహారంపై నియంత్రణ పెరగడమే కాకుండా, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభం అవుతుందని స్పష్టం చేశారు.
నాణ్యతలో రాజీ పడేది లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఈ ల్యాబ్ లు కీలక భూమిక పోషిస్తాయని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. మూడు నెలలలోనే విశాఖ మరియు గుంటూరులో ల్యాబ్ లు ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. నాణ్యతలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
-
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్లో కీలక మార్పులు, ఇక సులభంగా..!! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం: ఎయిర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ విధింపు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?













Click it and Unblock the Notifications