ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో కూటమి అభ్యర్ధి ఘన విజయం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు హవా కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు.
ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి.. మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. ఇక పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు ఏడో రౌండ్ ముగిసేసరికి 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా.. కౌంటింగ్ పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం కనబడుతోంది.

ఇక విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. రెండు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేస్తానని.. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని పేరాబత్తుల మండిపడ్డారు. కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
-
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications