గోశాలలో 21 గోవుల మృతి: సాంబశివ రావు అరెస్టు
విజయవాడ: దుర్గగుడి దగ్గర గోశాలలో గోవుల మృతి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా సోమవారం మరో రెండు గోవులు మృతి చెందాయి. దీంతో గోశాలలో ఇప్పటి వరకు గోవుల మృతి సంఖ్య 21కి చేరింది. గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి దేవినేని ఉమా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు గోవులకు దాణా పంపిణీ చేసిన భవానీ ఇండస్ట్రీస్ అధినేత సాంబశివరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దానికి తోడు, గోసంరక్షణ కేంద్రానికి చెందిన 39 మంది నిర్వాహకులతో పాటు మేనేజర్పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులు మృతి చెందడం పట్ల విజయవాడ ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివిధ పార్టీల నేతలు గోసంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపడుతున్నారు. సోమవారంనాడు సీపీఐ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం ధర్నా నిర్వహించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications