మరో వికెట్, జగన్కు గుర్నాథ్రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నా
Recommended Video

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది.
గుర్నాథ్ రెడ్డి గురువారం లేదా శుక్రవారం రాజధాని అమరావతి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. గుర్నాథ్ రెడ్డి చేరుతారని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలో బెంగ పట్టుకుంది. దీంతో ఆయన హడావుడిగా సీఎం చంద్రబాబును కలిశారు.

చంద్రబాబు ఎదుట ప్రభాకర్ చౌదరి ఆందోళన
చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన ఆందోళన ఆయన ముందు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మొదలు, గుర్నాథ్ రెడ్డి పార్టీలో ఎందుకు చేరుతున్నారో అధినేతకు పూసగుచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు కూడా ఆయన మాటలను సావధానంగా విన్నారు. నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గుర్నాథ్ రెడ్డి రాకకు కారణాలు ఇవే
గుర్నాథ్ రెడ్డి చేరికపై చంద్రబాబును అడగగా.. పార్టీ బలోపేతం కోసమే ఆయనను తీసుకుంటున్నట్లుగా ప్రభాకర్ చౌదరికి తెలిపారు. 2019 నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అయితే గుర్నాథ్ రెడ్డి రాక వెనుక పలు కారణాలు ఉన్నాయని ప్రభాకర్ చౌదరి తెలిపారు.

మిస్సమ్మ బంగ్లా, వ్యాపారాలు
ఆయన టీడీపీ కోసం కాకుండా వ్యాపారాల కోసమే మన పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబుతో ప్రభాకర్ చౌదరి తెలిపారు. బిజినెస్ కోసం వస్తున్న వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీంతో పాటు మిస్సమ్మ బంగ్లా కోసమే ఆయన టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోందని తెలిపారు.

అంతలేదని చంద్రబాబు!
దీనిపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో వ్యాపార ధోరణిని కంట్రోల్ చేస్తామని వెల్లడించారు. అలాగే గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరినప్పటికీ మిస్సమ్మ బంగ్లా విషయంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని తెలిపారు. ఈ బంగ్లా విషయంలో ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండదని తెలిపారు.

గుర్నాథ్ రెడ్డి వచ్చినా మీ నాయకత్వంలోనే పని చేయాలి
గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరినా మీ నాయకత్వంలోనే పని చేయాలని ప్రభాకర్ చౌదరితో చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. పార్టీ ప్రయోజనాల కోసమైతే గుర్నాథ్ రెడ్డి వస్తే ఇబ్బంది లేదని చెప్పారు.

ఏం జరుగుతుందోనని ప్రభాకర్ చౌదరి ఆవేదన
ఇప్పటికే, జేసీ దివాకర్ రెడ్డిపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలోని నేత, తనపై గతంలో పోటీ చేసిన వైసిపి నాయకుడు రావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికి హామీ ఇచ్చినప్పటికి భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన ప్రభాకర్ చౌదరిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. గుర్నాథ్ రెడ్డి వెనుక జెసి దివాకర్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం సాగింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications