ఏపీ టు తెలంగాణ: ఈఎస్ఐ స్కాంలో కోదాడకు ఏసీబీ, అజ్ఞాతంలోకి ప్రమోద్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ తెలంగాణ రాష్ట్రానికి చేరింది. కోదాడలో ఏపీ ఏసీబీ అధికారులు వాలిపోయారు. టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ ఇంటి వద్దకు రాగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ అతనికి ఈఎస్ఐ స్కాంతో సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఏ-1గా, మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏ-2గా చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కుంభకోణానికి సంబంధించి టెలీ హెల్త్ సర్వీస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డిని ఏ-3గా చేర్చారు. స్కాంపై విచారించేందుకు కోదాడకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఏపీ నుంచి అధికారులు తెలంగాణకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్కాంలో ఇంకా ఎవరికీ సంబంధం ఉందోననే అంశంపై విచారణలో స్పష్టత రావాల్సి రానున్నది.

నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోద్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఆదివారం కోదాడ వచ్చారు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొబైల్ ఆన్ ఉంటే లొకేషన్ ఆధారంగా కనిపెడతారని భావించి.. స్వీచాఫ్ చేసుకున్నాడు.
ప్రమోద్ రెడ్డి లేకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి.. కంపెనీకి సంబంధించి అడిగినట్టు సమాచారం. ప్రమోద్ రెడ్డి స్వస్థలం అనంతగిరి మండలానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. అతని ఆఛూకీ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications