బడ్జెట్ కేటాయింపులు, చంద్రబాబు టార్గెట్ ఫిక్స్- బిగ్ టర్న్..!!
AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమం - అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసారు. బడ్జెట్ ప్రతిపాద నలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనల ను సభకు ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధుల కేటాయింపులు చేసారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కేటాయించినట్లు సమాచారం.
3.24 లక్షల కోట్ల అంచనాతో
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశ పెడుతున్నారు. దాదాపు 3 లక్షల 24 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్ట నున్నట్లు సమాచారం. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు కేశవ్ బడ్జెట్ ప్రతులను అందించారు.

సంక్షేమానికి నిధులు
మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసారు. బడ్జెట్ ప్రతులతో అమరావతి లోని వెంకటాయపాలేనికి వెళ్లిన ఆర్థికమంత్రి పయ్యావుల అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధుల కేటాయింపు చేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా హామీల అమలు చేయటం లేదనే రాజకీయ విమర్శలకు ఈ బడ్జెట్ ద్వారా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
మూడు విడతల్లో రైతు భరోసా
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతలుగా వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలుకు వీలుగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు సమా చారం. అదే విధంగా తల్లికి వందనం పథకాన్ని మే మాసంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పథకం నిర్వహణ అంచనాలకు తగిన విధంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ప్రతిపాదన పూర్తయిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు. బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలు.. తాజా రాజకీయ పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications