చంద్రబాబును వెంటాడుతున్న అమరావతి
Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. అమరావతి భూ కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఈ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనపై తాజాగా ఛార్జిషీట్పై ఫైల్ చేశారు.
2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ 4,400 కోట్ల రూపాయలు. సుమారు 1,100 ఎకరాల మేర అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

జీవో నంబర్ 41ని జారీ చేయడం ద్వారా ల్యాండ్ పూలింగ్ పథకం కిందమందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం.. వంటి గ్రామాల్లో 1,100 ఎకరాల మేర సమీకరించారని సీఐడీ అధికారులు తమ ఛార్జిషీటులో పొందుపరిచారు. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేవీపీ అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం తదితరులు బినామీలుగా వ్యవహరించినట్లు తెలిపారు.
ఈ ఛార్జిషీటులో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంలో మున్సిపల శాఖ మంత్రిగా పని చేసిన పొంగూరు నారాయణ, రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం మాజీ తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీపీ అంజనీ కుమార్ అలియాస్ బాబీపై పేర్లు ఉన్నాయి.
మంగళగిరిలోని ఏపీ సీఐడీ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. సీఆర్ నంబర్ 14/2020, సీఆర్ నంబర్ 15/2020, ఐపీసీ సెక్షన్లోని 420, 409, 506, 166, 167, 217, 109 సెక్షన్ల కింద చంద్రబాబు సహా మిగలిన వారిపై కేసులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ.. ఈ కేసు తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications