రబీలో ఒక్క ఎకరం కూడా ఎండకూడదు: చంద్రబాబు
విజయవాడ :రీబీలో ఒక్క ఎకరం కూడ పంట ఎండకుండా కాపాడాలని అధికారులను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
నీరు _ప్రగతి పై సోమవారం నాడు చంద్రబాబునాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రబీ సమయంలో జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వర్షపాతం నమోదైన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.రబీ లో పంటలను రక్షించేందుకు ఇప్పటినుండే అధికారులు ప్రణాళకలను సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు.
సిమెంట్ రోడ్ల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న నెల్లూరు, శ్రీకాకుళం,కర్నూల్ యంత్రాంగాన్ని చంద్రబాబునాయుడు అభినందించారు. ప్రతి జిల్లాల్లో వారానికి వంద కిలోమీటర్ల సిమెట్ రోడ్ల నిర్మాణం జరగాలన్నారు.












Click it and Unblock the Notifications