బిజీగా గడిపిన చంద్రబాబు: ఒకటి తర్వాత..(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. శనివారం ఉదయం మొదట దూరదర్శన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర దూరదర్శన్ ఛానల్ సప్తగిరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ్యాంధ్రప్రదేశ్ను పునాదులను నుంచి నిర్మాంచాల్సిన ఉందని అన్నారు.
ఏపీ కొత్త రాజధానికి ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. వార్తా సంస్థలకు సంచలనాలు కాదు, విశ్వసనీయత అవసరమని ఆయన అన్నారు. మంచి కార్యక్రమాలకు...వార్తల్లో చోటు లభించడం లేదని బాబు వ్యాఖ్యానించారు. చిన్నకాగితం నేతలపైకి విసిరితే పెద్ద వార్తగా చూపుతున్నారన్నారు.
సోషల్ మీడియా ద్వారా వేగంగా వార్తలందుతున్నాయని బాబు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ వినూత్న పంథాలో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోడీ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని వెల్లడించారు. ఏపీ రాజధానిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెనాలి, మంగళగిరి, గుంటూరు, విజయవాడను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు నాయుడు విజయవాడ దుర్గామాతను దర్శించుకున్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు.
చంద్రబాబు
శనివారం ఉదయం మొదట దూరదర్శన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు
చంద్రబాబు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర దూరదర్శన్ ఛానల్ సప్తగిరిని ప్రారంభించారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ్యాంధ్రప్రదేశ్ను పునాదులను నుంచి నిర్మాంచాల్సిన ఉందని అన్నారు.
చంద్రబాబు
ఏపీ కొత్త రాజధానికి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
చంద్రబాబు
వార్తా సంస్థలకు సంచలనాలు కాదు, విశ్వసనీయత అవసరమని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
మంచి కార్యక్రమాలకు... వార్తల్లో చోటు లభించడం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు
వెంకయ్య నాయుడు
సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.
హాజరైన అధికారులు, ప్రతినిధులు
చిన్నకాగితం నేతలపైకి విసిరితే పెద్ద వార్తగా చూపుతున్నారని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
సోషల్ మీడియా ద్వారా వేగంగా వార్తలందుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
స్వాగతం..
ప్రధాని నరేంద్రమోడీ వినూత్న పంథాలో పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
ప్రారంభోత్సవం
దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోడీ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని వెల్లడించారు.
నివాళి
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళులర్పిస్తున్న దృశ్యం.
జ్జాపిక
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ చేపడుతున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మేకింగ్ ఇండియా నినాదాన్ని మనం మేకిన్ ఆంధ్రప్రదేశ్గా చేపడతామన్నారు.
ఎయిర్పోర్ట్ నుంచి..
సంచలనాలు కాదు, విశ్వసనీయ వార్తలను అందించాలని ఈ సందర్భంగా మీడియాను కోరారు. దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని దూరదృష్టితో పని చేస్తున్నారని అన్నారు.
బాబుకు స్వాగతం
అక్టోబర్ 2 నుంచి రూ. 1000 వృద్ధాప్య పింఛన్లు అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
బాబుకు స్వాగతం
విజయవాడ-గుంటూరు మధ్యే ఏపి రాజధానికి అనువైన వాతావరణం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ నుంచే పని చేయాల్సి ఉంటుందని అన్నారు.
బాబుకు స్వాగతం
విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలిలను కలిపి మెగాసిటీ నిర్మిస్తామని ఆయన అన్నారు.
బాబుకు స్వాగతం
గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులు.