రాజేంద్రప్రసాద్కు షాక్: పార్టీ అనుమతి లేకుండా బిజెపిపై విమర్శలొద్దు: బాబు
Recommended Video

అమరావతి:గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏపీలో టిడిపి, బిజెపి మధ్య మాటల యుద్దానికి తెరతీసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అయితే సోము వీర్రాజుపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, బిజెపి నేతల మధ్య కొంతకాలంగా సంబంధాలు చెడుతున్నట్టు కన్పిస్తోంది. కానీ, పైకి మాత్రం రెండు పార్టీల నేతలు మాత్రం తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెబుతున్నారు.
గుజరాత్ రాష్ట్ర ఎన్నికల పలితాలు బిజెపి నేతల్లో జోష్ నింపాయి.అయితే ఈ ఫలితాలను చూసి బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలకు ఆగ్రహన్ని కల్గించాయి.

టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం
గుజరాత్ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలకు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీని డిసైడ్ చేసేది తామేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.అంతేకాదు పరోక్షంగా టిడిపిపై వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు భావించారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. సోము వీర్రాజుపై బాబుకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. వీర్రాజు వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మంటను పుట్టించాయి.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారని సమాచారం. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని సమాచారం. బీజేపీ నాయకుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై వ్యాఖ్యలు చేశారు.

వీర్రాజు విచక్షణకు వదిలేయాలి
టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడినట్టు సమాచారం..సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా... భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాజేంద్రప్రసాద్కు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

టిడిపి, బిజెపి నేతల మధ్య గ్యాప్
పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పైకి మాత్రం రెండు పార్టీల నేతలు మాత్రం తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కొందరు బిజెపి నేతలు బహిరంగంగానే ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఈ పరిణామాలు టిడిపిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి.అయితే అదే సమయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కోసం టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై రెండు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ సమావేశం జరిగిన వారం రోజులకే సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications