జగన్ పంద్రాగష్టు మొదటి ప్రసంగం: ఎందుకీ ఆహాకారాలు, గతిని మార్చే చట్టాలు తెచ్చాం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా..ముందకే వెళ్తామని స్పష్టం చేసారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని స్పష్టంగా తేల్చి చెప్పారు. చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

హాహాకారాలు..గగ్గోలు..యాగీ ..నేను చేసిన తప్పేంటి..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తన ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. సమాజంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయనిమచ్చలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన పలువురు రాష్ట్ర పోలీసులకు మెడల్స్ అందించారు. తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు..వాటిని ఎంచుకున్న విధానాన్ని ముఖ్యమంత్రి వివరించారు. వరత్నాలు, సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు..ప్రభుత్వ నిర్ణయాలను తన ప్రంసగంలో ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. రైతులకు.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు వీలుగా చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్లు.. కమిషన్ల కోసం అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నానా యాగీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు తప్పా..అసలు ప్రభుత్వం చేసిన తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాలు వినూత్న ప్రక్రియ..
గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని సీఎం జగన్ వివరించారు. మద్యపానాన్ని నిషేధించేదిశగా నూతన మద్య విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రగతిని మార్చే చట్టాలు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటుగా ఎస్సీ.. ఎస్టీ.. మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. నామినేటెడ్ పదవులు.. నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం తీసుకొచ్చామని.. ఇలాంటి చట్టాలు తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంట్ ప్రస్తుతం 60 శాతం ఇస్తున్నామని తెలిపారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని స్పష్టం చేసారు. మద్యనియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులు మూయించడమే కాకుండా వాటిని శాశ్వతంగా మూయించేందుకు లాభాపేక్ష లేకుండా అక్టోబర్ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మేలా నిర్ణయం అమలు చేస్తామన్నారు. భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైఎస్సార్ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నానంటూ జగన్ పేర్కొన్నారు.

పరిస్థితులను మార్చుకుందామా..వద్దా
తన ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి, అధికారం పాలు.. నీళ్లలా కలిసిపోయాయని.. అవి అలాగే ఉంటాయని వదిలేద్దామా.. లేక ఈ పరిస్థితులను మారుద్దామా.. అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువద్దామనే దృఢ నిశ్చయంతో నవరత్నాలు తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం లో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. కులం..మతం..ప్రాంతం..పార్టీ ఏవీ లేవని..చివరకు తమకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమం అందిస్తామన్నారు. మనదే. బీసీ కులాలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాన్బోన్లుగా వెన్నెముక కులాలుగా చేస్తామన్న మాటకు కట్టుబడి బీసీ కమిషన్ను ఏర్పాటు చేసామని చెప్పుకొచ్చారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. వెయ్యి రూపాయాల ఖర్చు దాటితే ప్రతీ రోగానికి ఆరోగ్యానికి ఉచితంగా వైద్యం అందిస్తామని స్పష్టం చేసారు. జనవరి 1 నుండి 104..108 పూర్థి స్థాయిలో అందుబాటులో వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగేళ్లలో ఏపీ స్వరూపం మార్చి వేస్తామని జగన్ ప్రకటించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications