కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం వైఎస్ జగన్ భేటీ: ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రిని కోరారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ సీఎం జగన్ పాల్గొన్నారు.

కాగా, ఏపీ సీఎం జగన్ మంగళవారం ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను ఆయన కోరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల మంజూరు అంశాన్ని సీఎం ప్రస్తావించనున్నారు.
ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రధాని మోడీ, జల్శక్తి మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పోలవరం పనులను వేగవంతం చేసేలా చూడాలని ఇప్పటికే ఆర్థిక, ఇతర శాఖలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల జరిగిన అపెక్స్ సమావేశంలో కీలక ఆదేశాలు సైతం ఇచ్చింది. ఏపీలో ఇంతకుముందు 13 జిల్లాలు ఉండగా, మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఏర్పాటైన కొత్త జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications