ఏపీ కోవిడ్ హెల్త్ బులిటెన్ : 24 గంటల్లో 18561 కేసులు, 109 మరణాలు-తగ్గిన టెస్టులు
ఏపీలో కోవిడ్ 19 కేసుల విజృంభణ గత 24 గంటల్లో స్వల్పంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే గరిష్టంగా 24 వేరకుచేరువగా వచ్చిన కేసులు ఒక్క రోజులోనే 18 వేలకు పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం టెస్టుల సంఖ్య తక్కువ కావడమే. పలు చోట్ల టెస్టుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు కేసుల సంఖ్య కూడా తగ్గినట్లు తాజా హెల్త్ బులిటెన్ స్పష్టం చేస్తోంది.
Recommended Video
ఏపీలో గత 24 గంటల్లో 18 వేల 561 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3152 కేసులు నమోదు కాగా... విశాఖ 2098, అనంతపురం 2094, గుంటూరు 1639, చిత్తూరు 1621, శ్రీకాకుళం 1287, నెల్లూరు 1282, పశ్చిమగోదావరి 1185, ప్రకాశం 1115 కేసులు నమోదయ్యాయ్యి. అత్యల్పంగా కృష్ణాజిల్లాలో 396 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 14.54 లక్షలకు చేరుకుంది.
ఏపీలో ఇప్పటివరకూ పాజిటివ్గా తేలిన 14.54 లక్షల మందిలో 12.33 లక్షల మంది కోలుకున్నారు. మరో 2.11 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 109 మంది చనిపోయారు. వీరిలో పశ్చిమగోదావరిలో అత్యధికంగా 16 మంది, అనంతపురంలో 10, చిత్తూరులో 10, గుంటూరులో 10, తూర్పుగోదావరిలో 9, విశాఖలో 9, కృష్ణాలో 8, నెల్లూరులో 8, విజయనగరంలో 8, కర్నూల్లో 7, శ్రీకాకుళంలో 7. ప్రకాశంలో 4, కడపలో మూడు మరణాలు చోటుచేసుకున్నాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 9481కు చేరుకుంది. గత 24 గంటల్లో ప్రభుత్వం 73749 టెస్టులు చేసింది.