వెయిటింగ్ ఐపీఎస్ లకు డిజీపీ మార్క్ షాక్..!!
ఏపీ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హాయంలో నాడు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వారిలో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ తో సహా మరో 15 మంది ఉన్నారు. ఇప్పుడు వారి విషయంలో డీజీపీ తాజాగా మెమోలు జారీ చేసారు.
రాష్ట్రంలో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్లో ఉండి హెడ్క్వార్టర్స్లో అందుబాటులో లేని వారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్నీ, రవిశంకర్రెడ్డి, రిషాంత్రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు ఈ మెమోలు జారీ అయ్యాయి.

వీరంతా ఇక నుంచి ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఈ తరహా ఆదేశాలు ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులు తాజాగా చంద్రబాబు సీఎం అయిన తరువాత రెండు సార్లు కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. అదే విధంగా చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన రఘురామిరెడ్డి ప్రయత్నించారు. కానీ, అవకాశం ఇవ్వలేదు.
ఈ అధికారులు పూర్తిగా నాటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వీరి పైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా డీజీపీ ఇచ్చిన మెమోల వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications