సూది సైకోను పట్టుకుంటాం, హైదరాబాద్లో సహకరిస్తాం: డిజిపి రాముడు
తిరుపతి: సాధ్యమైనంత త్వరలో విజయవాడ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ డిజిపి రాముడు అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో పోలీస్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం, తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో జరుగుతున్నాయని చెప్పిన ఆయన, తిరుమలలో భద్రతా ఏర్పాట్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

హైదాబాద్లో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సహకరిస్తారని డిజిపి రాముడు తెలిపారు. ఏపిలో రెచ్చిపోతున్న సూది సైకోను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్మగ్లర్ గంగిరెడ్డితోపాటు మరో ఇద్దరినీ విదేశాల నుంచి రప్పిస్తామని తెలిపారు.
తిరుమలలో భక్తీ రద్దీ
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 14గంటలు సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 12గంటల సమయం పడుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications