జగన్ కేబినెట్ నిర్ణయాల్ని స్వాగతించిన ఉద్యోగులు-ఏమన్నారంటే ?
ఏపీలో ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలకు, ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇవాళ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఐదు అంశాలపై ఇవాళ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలపై
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పందించింది.
ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి స్వాగతించారు. ఉద్యోగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. డీఏ జీవోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం HRA అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు.

గతంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు జగన్ మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులను న్యాయం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్త పీఆర్సీ కమిషన్ వేసేందుకు కేబినెట్ నిర్ణయం పైనా కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఆర్సీ,,ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మినహా పాత పెన్షన్ విధానంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితి బాగుంటే మరిన్ని ప్రయోజనాలు ఇచ్చేలా సీఎం ముందుకెళ్తారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆయా అంశాలపై తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, దీని ఫలితంగా ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయాలు తీసుకుందన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications