మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపు - రూ 9,412 కోట్ల భారం, ఎవరి పై ఎంత..!!
ఏపీలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పెంపు రెండో సారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్ నెల నుంచి వినియోగదారుల పైన రూ 9,412 కోట్ల మేర భారం పడనుంది. సర్దుబాటు చార్జీలను యూనిట్కు 92 పైసలు చొప్పున 2026 నవంబరు వరకూ వసూలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో వినియోగదారుల పై మరింత భారం పడనుంది.
విద్యుత్ ఛార్జీల బాదుడు
ఏపీలో విద్యుత్ వినియోగదారుల పై మరింత భారం మోపే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ట్రూ అప్తో పాటు రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్పిపిసిఎ) ఛార్జీలతో నడ్డివిరుస్తున్న విద్యుత్ సంస్థలు మరోసారి భారం మోపుతున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్ర ణ మండలి అనుమతి లభించింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఛార్జీల పెంపుకు సంబంధిం చి ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్సీకి డిస్కం లు ప్రతిపాదనలు పంపాయి.

ఈఆర్సీ అనుమతితో
అందులో రూ.3,432 కోట్లుకు కోత విధించిన ఈఆర్సీ... మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1,500 కోట్లు పోను) ప్రజల నుంచి వసూలు చేసుకొనేందుకు ఆమోదం తెలిపింది.తాజాగా అనుమతి రావటంతో ఇక, ఈ సర్దుబాటు చార్జీలను యూనిట్కు 92 పైసలు చొప్పున వచ్చే నెల (డిసెంబరు) నుంచి 2026 నవంబరు వరకూ వసూలు చేయాలని డిస్కం లకు ఈఆర్సీ సూచించింది. ఈఆర్సీ అనుమత మేరకు డిస్కంలు ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు డిస్కంలు వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి.
పెంపు ఎక్కడ ఎంత
మిగిలిన రూ.6,543.60 కోట్లను వచ్చే డిసెంబర్ నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేసుకోవాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఎస్పిడిసిఎల్) పరిధిలో యూనిట్కు 0.9132 పైసలు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిసిపిడిసిఎల్) పరిధిలో 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్) పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఆరు నెలల కాలంలో ప్రజల పైన వరుసగా రెండో సారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ భారం మోపటం పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications