AP Pensions: ఆ పెన్షన్లపై మంత్రి కీలక ప్రకటన..! పుల్ క్లారిటీ..!
ఏపీలో జనవరి నెల పెన్షన్లను ఒకరోజు ముందుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ సచివాలయ ఉద్యోగులు తాజాగా కోరడంతో ఆ మేరకు ప్రభుత్వం అంగీకరించింది. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31నే పెన్షన్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో మరో మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వైసీపీ ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల దివ్యాంగుల పెన్షన్లను తొలగించిందంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. తాజాగా చేపట్టిన సర్వేల ద్వారా ఇలా భారీగా పెన్షన్లను తొలగిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ పెన్షన్ల తొలగింపుపై స్పందించింది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లపై బ్లూ మీడియా దిగజారుడు రాతలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని జగన్ అండ్ కో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి స్వామి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛను తొలగించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సదరం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు.

పింఛన్ల కోసం జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం18 నెలల్లోనే రూ. 50 వేల కోట్ల ఖర్చు చేసిందని మంత్రి గుర్తుచేశారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు 7 వరాలు ప్రకటించడంతో వారంతా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగ మింగారని మంత్రి విమర్శించారు. తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలతో పత్రిక విలువల్ని కాలరాస్తున్న వైసీపీ బ్లూ మీడియాని ప్రజలు చీత్కరిస్తున్నారని తెలిపారు.
-
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications