జగన్ బాటలోనే మేమూ.. ! చంద్రబాబు, పవన్, లోకేష్ క్లారిటీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ విచ్చలవిడిగా హెలికాఫ్టర్లను వాడుతున్నారనే ప్రచారాన్ని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పదే పదే తెరపైకి వచ్చేవారు. ప్రజా ధనాన్ని అప్పటి సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేసేవారు. సీన్ కట్ చేస్తే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హెలికాఫ్టర్లు వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్, ఇప్పుడు కూటమి పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ హెలికాఫ్టర్ల వినియోగాన్ని పోలుస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వైఎస్ జగన్ వాడిన దాని కంటే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ ల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా ఉందనేది వాటి సారాంశం. అంతే కాదు ఈ హెలికాప్టర్ల కోసం కూటమి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును కూడా జీవోలు, అంకెల రూపంలో ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారు.

వీటిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ హెలికాఫ్టర్ల వాడకంపై వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చింది. అయితే ఇందులో " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియే అని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 23, 2025
ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియే. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి… pic.twitter.com/IoZODElkHh
రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇందులో వెల్లడించారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా రూ.55 కోట్లు ఒక ఏడాదిలో, మరో ఏడాదిలో రూ.52 కోట్లు అనేది కేటాయించి, ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేసారని తెలిపారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ అని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు.
-
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!











Click it and Unblock the Notifications