బీసీలపై దాడికి పాల్పడితే కఠిన జైలు శిక్ష. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పటికి.. సామాజిక బహిష్కరణ, దూషణలు, కుల వివక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కీలక ముందడుగు వేసింది. నూతన సంవత్సరం తొలి రోజే 'బీసీ రక్షణ చట్టం' అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అసలు ఈ చట్టం ఎలా ఉపయోగపడుతుంది. ఏఏ సందర్భంలో ఈ చట్టాన్నీ బీసీలు సద్వినియోగపరుచకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచింది. చాలా ప్రాంతాల్లో జరుగుతున్న సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు చరమగీతం పాడేందుకు 'బీసీ రక్షణ చట్టం' కోసం ముసాయిదాను రూపొందించింది. మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా బీసీలపై దాడికి పాల్పడితే 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. తొలిసారి జైలు శిక్ష అనుభవించి మళ్లీ బయటకు వచ్చిన తర్వాత పద్దతి మార్చుకోకుండా మరోసారి నేరానికి ఒడిగడితే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది.
కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తే..
నేరానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చినప్పుడు.. ఓ వ్యక్తిని ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించి ఇరికించే ప్రయత్నం చేస్తే.. నేరాభియోగాలు మోపిన వ్యక్తికి మరణ దండన లేదా జీవిత ఖైదు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. బీసీలపై నేరాలకు సంబంధించి కంప్లైంట్ తీసుకుని, కేసు నమోదు చేసిన 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసినా.. కావాలనే కాలయాపన చేసినా.. సదరు అధికారులకు కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు.

ఏఏ సందర్భాల్లో ఈ చట్టం వర్తిస్తుందంటే
బీసీలన భయపెట్టినా.. కావాలనే అవమానించినా, కులం పేరుతో అవమానకర పదాలు వాడినా, తక్కువ చేసినా మాట్లాడినా ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామ బహిష్కరణ చేసినా.. వారికి రావాల్సిన అన్ని రకాల సేవలు నిలిపివేసినా, ప్రజాసేవల్లో వివక్ష చూపినా జైలుకు పోవాల్సిందే. ఇక భౌతిక దాడులు చేసి.. గాయాలపాలైనా, లేదా చొక్కా పట్టుకున్నా కేసు పడుతుంది.
సెక్షన్ 10ఏ ప్రకారం చర్యలు..
కబ్జాలు చేసినా, జీవనోపాధిని దెబ్బతీసినా, మత పరంగా దూరం పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననీయకకుండా చేసినా, బావులు, రహదారులు, ఘాట్లు వాడుకోకుండా అడ్డుకున్నా.. శ్మశానాలు, ఆలయాల్లోకి ప్రవేశాన్ని నిరాకరించినా బెయిల్ కూడా రాకుండా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. పౌరహక్కుల చట్టం-1955లోని సెక్షన్ 10ఏ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications