ఏపీలో ఆటో డ్రైవర్ల పథకానికి కొత్త పేరు ఇదే..! రేపటి నుంచి ఈ ప్రక్రియ ..!
ఏపీలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం తొలుత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 వేల రూపాయల చొప్పున ఇచ్చిన వాహన మిత్ర పథకం కొనసాగించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆటో మిత్రగా కూడా మార్చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త పేరును ఖరారు చేశారు. ఈ పేరుతోనే కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు సాయం అందించబోతోంది.
ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు అక్టోబర్ 1 నుంచి కూటమి ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఇచ్చే 15 వేల రూపాయల సాయానికి "ఆటో డ్రైవర్ల సేవలో" అనే కొత్త పేరు ఖరారు చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెబ్ సైట్ లో ఈ కొత్త పథకం పేరును ప్రభుత్వం చేర్చింది. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపిక, వారికి 15 వేల సాయం పంపిణీ అన్నింటినీ ఇకపై ఈ పేరుతోనే చేపట్టనున్నారు.

ఆటో డ్లైవర్లకు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ఈ 15 వేల రూపాయల పథకాన్ని అమలు చేయబోతోంది. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం సొంత ఆటో లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండి స్వయంగా నడుపుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయనున్నారు. అలాగే మరికొన్ని షరతులు కూడా పెట్టారు. వీటి ప్రకారమే ఆటో డ్రైవర్లకు, మ్యాక్సీ క్యాబ్ డ్లైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయబోతున్నారు. దీంతో వారంతా ఈ కొత్త పథకంపై అవగాహన పెంచుకుని, ఆ పేరుతోనే సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.













Click it and Unblock the Notifications