Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఆటో డ్రైవర్ల పథకానికి కొత్త పేరు ఇదే..! రేపటి నుంచి ఈ ప్రక్రియ ..!

ఏపీలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం తొలుత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 వేల రూపాయల చొప్పున ఇచ్చిన వాహన మిత్ర పథకం కొనసాగించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆటో మిత్రగా కూడా మార్చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త పేరును ఖరారు చేశారు. ఈ పేరుతోనే కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు సాయం అందించబోతోంది.

ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు అక్టోబర్ 1 నుంచి కూటమి ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఇచ్చే 15 వేల రూపాయల సాయానికి "ఆటో డ్రైవర్ల సేవలో" అనే కొత్త పేరు ఖరారు చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెబ్ సైట్ లో ఈ కొత్త పథకం పేరును ప్రభుత్వం చేర్చింది. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపిక, వారికి 15 వేల సాయం పంపిణీ అన్నింటినీ ఇకపై ఈ పేరుతోనే చేపట్టనున్నారు.

ap government finalised auto driver sevalo name to 15k assistance scheme to auto max cab owners

ఆటో డ్లైవర్లకు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ఈ 15 వేల రూపాయల పథకాన్ని అమలు చేయబోతోంది. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం సొంత ఆటో లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండి స్వయంగా నడుపుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయనున్నారు. అలాగే మరికొన్ని షరతులు కూడా పెట్టారు. వీటి ప్రకారమే ఆటో డ్రైవర్లకు, మ్యాక్సీ క్యాబ్ డ్లైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయబోతున్నారు. దీంతో వారంతా ఈ కొత్త పథకంపై అవగాహన పెంచుకుని, ఆ పేరుతోనే సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.

ap government finalised auto driver sevalo name to 15k assistance scheme to auto max cab owners
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హులైన ఆటో రిక్షా, మోటారు క్యాబ్‌, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు సచివాలయాల శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 19 వరకూ అందిన దరఖాస్తులపై గ్రామ,, వార్డు సచివాలయాల సిబ్బంది 22వ తేదీన క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఎంపీడీఓలు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌లు వీటి తుది జాబితాలను కలెక్టర్లకు పంపుతారు. అర్హుల జాబితాను ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన వారికి దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 1న బ్యాంకుల్లో 15 వేల నగదు జమ చేస్తారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+