పెన్షన్లు ఇక వీరికే, వారికి కోత - ప్రభుత్వం ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటుగా అనర్హులవి రద్దు దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. 26 రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ 4 వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్లి అందిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్త 64,14,174 మంది పెన్షన్ అందుకుంటున్నారు. వీరిలో వృద్ధులతో పాటుగా, దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు.

దరఖాస్తులు ఇలా
అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తా మని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో అర్హత లేని వారికి లబ్ది అందుతున్నట్లు గుర్తించారు. వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం. pic.twitter.com/b0uyg5Y7xZ
— Kondapalli Srinivas (@SKondapalliOffl) November 14, 2024
జనవరిలో పంపిణీ
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు లక్షల మంది వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిం చి .. డిసెంబర్ నెలాఖరులో గా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో ప్రారంభించే జన్మభూమి -2 లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తెలిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక, పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకోని వారికి మూడో నెలలో మొత్తం కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications