Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులు-జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై పెరుగుతున్న లైంగిక వేధింపులనివారణకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది.

అమరావతి : ఏపీలో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు అంతర్గతంగా ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలు ఫిర్యాదుల స్వీకరణలో ప్రధాన భూమిక పోషిస్తాయని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు.

సచివాలయంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో "పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరు పై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యత నిస్తూ సీఎం జగన్ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సాధికారతకు బడ్జెట్ లోనూ భారీ నిధులను కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు.

ap government orders all deparments to appoint internal complaint committees on sexual harrassments

అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేదింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు మహిళలు వారి సమస్యలను నిర్బయంగా చెప్పుకునేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉపయోగపడాలని మంత్రి కోరారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

ap government orders all deparments to appoint internal complaint committees on sexual harrassments

మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న "సబల" కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

జరిగిందన్నారు. ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఇంకా కమిటీలు ఏర్పాటు చేయని కార్యాలయాల్లోని ఉద్యోగినులు వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ దాకా రావాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ దాకా మహిళా ఉద్యోగినులు వచ్చే పరిస్థితి లేకుండా అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+