అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి రైతులకు జగన్ సర్కార్ తీపికబురు- వరుసగా రెండో ఏడాది.....

|
Google Oneindia TeluguNews

ఓవైపు రాజధాని తరలింపు ప్రయత్నాలు, మరోవైపు కరోనా కష్టాలతో అల్లాడుతున్న అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎట్టకేలకు కౌలు విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.190 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పురపాలక శాఖ రెండు జీవోలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రైతులకు కౌలు విడుదల చేయడం ఇది రెండోసారి.

ap government release rs.190 cr annuity amount to amaravati farmers

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ఈ ఏఢాది తమకు కౌలు మొత్తం విడుదల ఆలస్యం కావడంతో హైకోర్టును ఆశ్రయించారు. తమకు కౌలు విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు. విపక్ష పార్టీలు కూడా కౌలు విడుదలకు సంబంధించి నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కౌలు విడుదల చేస్తూ పురపాలకశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రైతులకు ఊరట నిచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే 900 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

రాజధాని తరలింపుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు- జగన్ నిర్ణయంపై క్లారిటీ ఇదే...రాజధాని తరలింపుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు- జగన్ నిర్ణయంపై క్లారిటీ ఇదే...

English summary
andhra pradesh government has released annuity ammount of rs. 190 cr to amaravati farmers who had given their lands to construction of capital earlier. jagan govt has release the amount for second year after coming to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X