రెండేళ్ల కోసమే వస్తే వద్దు: తెలంగాణ వారికి ఏపీ షాక్, వారికి ఊరట
హైదరాబాద్: తెలంగాణ స్థానికులుగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది!
ఉద్యోగుల కేటాయింపు తర్వాత తాము తెలంగాణ వాళ్లం కాబట్టి ఏపీకి వెళ్లమనికమల్నాథన్ కమిటీకి లేఖలు రాసిన ఉద్యోగులు కొందరు... ఇప్పుడు ఏపీలో విధులు నిర్వహించేందుకు వరుస కడుతున్నారంటున్నారు.
తెలంగాణలో పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు ఉంది. దీంతో, పలువురు తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు మొదట ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. 60ఏళ్లుగా పదవీ విరమణ వయస్సు ఉండటంతో ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు.

ముఖ్యంగా, పదవీ విరమణ గడువైన 58 ఏళ్లు దాటగానే ఏపీలో చేరేందుకు వరుస కడుతున్నారంటున్నారు. గడచిన మూడు నెలల వ్యవధిలో ఎంతో మంది ఉద్యోగులు ఏపీలో రిపోర్ట్ చేసి తమను కొనసాగించాలని కోరగా, ఇలా రెండేళ్ల సర్వీసు కోసం వస్తున్న వారిని తీసుకోరాదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తేల్చి చెప్పారు.
ఈ మేరకు ఆయన గురువారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించగానే విధుల్లో చేరిన తెలంగాణ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదని, వారు రెండేళ్ల సర్వీసును ముగించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, కేవలం రెండేళ్ల సర్వీసు కోసం వచ్చే వారికి మాత్రం షాకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వారికి మాత్రం శుభవార్త.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications