టీచర్ల బదిలీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-త్వరలో ఆ లిస్ట్ రిలీజ్..!
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియార్టీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలో గతంలో టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తేవి. వాటిని నివారించడానికి ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా వారి సీనియార్టీ జాబితాలు సిద్దం చేయిస్తోంది. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ఆన్ లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. దీని తర్వాత సీనియార్టీ జాబితా విడుదల కానుంది.

అయితే టీచర్ల సీనియార్టీ లెక్కింపు విషయంలో టీచర్లు 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండానే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా, లేక పరస్పర బదిలీల కింద స్కూల్స్ మారినా వారు తమ పాత స్కూళ్లలోనే ఉన్నట్లు లెక్కించనున్నారు. వారిని పాత స్కూల్లో ఉన్నట్లే లెక్కించి 8 ఏళ్లు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ చేయబోతున్నారు. అలాగే త్వరలో విడుదల చేసే సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు. అలాగే పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications