దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం...మొత్తం 13 రోజులు:ఎప్పటినుంచి ఎప్పటిదాకా అంటే?...
అమరావతి:అక్టోబర్ నెలలో రానున్న విజయ దశమిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అక్టోబర్ 9 నుంచి 21 వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 22 వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభించాలని పేర్కొంది.
సెలవు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేసింది. ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి.

21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో లో పేర్కొంది.దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి.












Click it and Unblock the Notifications