అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం - తాజా నిర్ణయంతో..!!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఇటు టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో గతంలో స్థలాలు కేటాయించిన కేంద్ర సంస్థలకు వాటిని రెన్యువల్ చేస్తున్నారు. ఇక.. రాజధానికి కీలకంగా భావిస్తున్న ఓఆర్ఆర్ నిర్మాణం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయం
అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో ప్రభుత్వం భూ సేకరణకు సిద్దమైంది. ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. అమరావతి నుంచి ఓఆర్ఆర్ వెళ్లే అయిదు జిల్లాల్లో భూసేకరణ కు సంబంధించి ప్రభుత్వం వీరికి బాధ్యతలు అప్పగించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్రోడ్డు నిర్మాణం కానుంది.ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లుగా అధికారులు ఖరారు చేసారు.

మూడు ఎలైన్ మెంట్లు
ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల 189.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు ఆమోదం తెలిపింది. కాగా, విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. చెన్నై- కోల్కతా జాతీయ రహదారిలో విజ యవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీట ర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనలో భాగంగా మూడుఎలైన్మెంట్లను ప్రభుత్వానికి సమర్పించింది.
ప్రత్యేక అధికారులు
ఓఆర్ఆర్ ఎలైన్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక, వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. అక్కడ ఆమోదం రాగానే ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీచేస్తారు. అభ్యంతరాలన్నీ పరిష్కా రమయ్యాక 3డీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం అధీనంలోకి వెళ్లినట్లు గుర్తిస్తారు. పరిహారం చెల్లింపు..భూముల బదలాయింపు తరువాత పూర్తి స్థాయిలో ఈ భూములు ఓఆర్ఆర్ నిర్మాణం కోసి వినియోగించనున్నారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications