Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ భూములు..ఇళ్లు మీవే, ప్రభుత్వం బంపరాఫర్ - ఇలా చేయండి..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక సారి ఇచ్చిన అవకాశం మరి కొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగియటంతో.. ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్కీమ్‌ను మరోసారి అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

స్థలాల క్రమబద్దీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు అవకాశం కల్పించింది. అయితే, అనేక మంది ఆ సమయంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్కీమ్‌పై సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పార్టీ నేతల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరోసారి నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt big decision over land regularization across the state guide lines issued fixed last date

అంటే, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్‌లు వేసుకుని నివసిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్‌, ఇతర కీలకమైన ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు.

మార్గదర్శకాలు జారీ

అందులో భాగంగా ఈ మేరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ఆదేశించింది. తాజాగా భూముల క్రమబద్ధీకరణలో విశాఖ జిల్లా గాజువాకకు మరో స్కీమ్‌ను ప్రభుత్వం పునరుద్ధరించింది. గాజువాక గ్రామ పరిధిలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే వెయ్యి చదరపు గజాల వర కు క్రమబద్ధీకరణకు అనుమతించాలని నిర్ణయించారు.

క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈ ఏడాది జూన్‌ 30 వరకు స్వీకరించాలని తాజా గడువును నిర్దేశించింది. జీవో నం. 45 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ పథకం గురించి అవగాహన పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+