అన్నా క్యాంటీన్లు మూయటం లేదు: ప్రక్షాళన చేస్తున్నాం: శాసనసభలో ప్రభుత్వం ప్రకటన..!
Recommended Video
ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ముతబడుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని పైన ప్రభుత్వం శాసనసభ నుండి స్పష్టత ఇచ్చింది. అన్నా క్యాంటీన్లను మూసివేసి..పేదవాడి కడుపుకొట్టే ఆలోచ న ప్రభుత్వానికి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న రంగు మాత్రమే మారుస్తున్నామని తేల్చి చెప్పింది. ఇక..వీటి నిర్వహణలోనూ అవినీతి చోటు చేసుకుంటుందం టూ వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసారు. పూర్తి ప్రక్షాళన చేసి క్యాంటీన్లను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అన్నా క్యాంటీన్లను మూసివేయం..
టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల పైన శాసనసభలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీ న్ల నిర్వహణ కోసం అక్షయ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఈనెల 31తో ముగియనుంది. దీని పైన ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో ఇక అన్నా క్యాంటీన్లు మూసివేస్తున్నారంటూ ప్రచారం సాగు తోంది. దీని పైన వైసీపీ సభ్యులు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి బొత్సా ప్రస్తుతం ఏపీలో 183 అన్న క్యాంటీన్లు మాత్రమే నడుస్తున్నాయని బొత్స స్పష్టం చేశారు. ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆదరా బాదరాగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. క్యాంటీన్ రంగు మార్చితే పథకం రద్దు చేసినట్టు కాదని బొత్స స్పష్టం చేశారు. పేదవాడి పొట్ట కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసారు.

క్యాంటీన్లను ప్రక్షాళన చేస్తన్నాం
అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నార ని.. వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని..మార్చురీ పక్కన కూడా పెట్టారన్నాని మంత్రి బొత్సా సమాధానం ఇచ్చారు. ఇటు వంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలి పారు. క్యాంటీన్లకు రంగు మారుస్తే మూసివేసినట్లా అని ప్రశ్నించారు. అయితే, అక్షయ ఫౌండేషన్తో ముగుస్తున్న కాంట్రాక్టు కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే దాని పైన మాత్రం స్ఫస్టత రాలేదు.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications