సచివాలయాల ఉద్యోగులు ఇక నుంచి, ప్రభుత్వం కీలక ఆదేశాలు - తప్పనిసరి..!!
ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాల సంస్కరణలో భాగంగా ఉద్యోగుల విషయం లో మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో సచివాలయాల సిబ్బంది హాజరు.. సమయ పాలన పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసారు. ఈ మేరకు ఇప్పుడు జిల్లా అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ ఆదేశాల మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగుల పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హాజరుపై దృష్టి సారించింది. అందుకుగాను క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అధికారులు చెప్పారని అనధికార డిప్యుటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పని చేయడం క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడం ఇకపై కుదరదని తేల్చి చెప్పింది. నిర్దేశించిన సమయంలోగా యాప్లో రోజూ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. రీ సర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు తప్ప మిగిలిన వారెవరికీ మినహాయింపు లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సచివాలయాల శాఖ ఈ మేరకు చర్యలను చేపట్టింది.

ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు పై జరిగిన చర్చలో సిబ్బంది తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయా ల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యుటేష న్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్ పెట్టింది. నిర్దేశించిన సమయంలోగా యాప్లో హాజరును తప్పనిసరి చేసింది. రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాలల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు. జాయింట్ కలెక్టర్ సూచించిన వారికే వెసులుబాటు ఉంది. వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications