Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తగ్గేదే లే...అంటున్న మంత్రి సురేష్ : పరీక్షల విషయంలో ఎందుకీ పట్టుదల : ఎవరి మెప్పు కోసం..!

ఏపీలో పరీక్షల విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. అనేక రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసాయి. తెలంగాణలో ఎటువంటి చర్చ లేకుండా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి..ఇంటర్ రెండో సంవత్సరం వాయిదా వేసారు. ఇప్పుడు అవి కూడా రద్దు ప్రతిపాదన పైన చర్చ నడుస్తోంది. కేంద్రం సైతం సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసింది. స్వయంగా ప్రధాని ఈ అంశం పైన సమీక్ష నిర్వహించి ....విద్యార్దుల ఆరోగ్యాన్ని..ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది. ఇక, పలు రాష్ట్రాలు ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో వైపు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ దీనినే ముఖ్యమంత్రి పైన రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు. పలు చర్చలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వాదన మరోలా ఉంది.

పదో తరగతి..ఇంటర్ పరీక్షలు వాయిదా వేయటానికి తమకు అభ్యంతరం లేదని చెబుతూనే తమ ఉద్దేశాన్ని వివరించారు. టెన్త్...ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేస్తే మంచి కాలేజీల్లో సీట్లు రావాని..భవిష్యత్ లోనూ విద్యార్ధులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తల్లితండ్రులు కోరితే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వ వాదనగా ఉంది. ఇక, ఈ రోజు మంత్రి సురేష్ టెన్త్..ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పరీక్షలు నిర్వహిస్తామని...రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలే దీనిని వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. మరో వైపు కోర్టులో ఇదే అంశం పైన దాఖలైన పిటీషన్ల విచారణ సమయంలో ప్రభుత్వం వరుసగా టెన్త్..ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టుకు నివేదించింది. జూలైలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు స్పష్టం చేసింది.

AP Govt keen on Conducting 10th and Inter exams, Minister Suresh clarifies

అయితే, ఇలా వాయిదా వేసుకుంటూ పోవటం...ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేకపోవటంతో అటు విద్యార్ధులు..ఇటు వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. పరీక్షల కోసం ఎంత కాలం ప్రిపేర్ అవుతూ ఉండాలనే ప్రశ్న వారి నుండి ఎదురవుతోంది. ఇలా చదువుతూనే ఉండాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీచర్లు సైతం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం..ఇతర రాష్ట్రాలకు లేని అభ్యంతరం కేవలం ఏపీకి మాత్రమే ఎందుకు ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు థర్డ్ వేవ్ గురించి భిన్న వాదనలు..హెచ్చరికలు వస్తున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్.. ఆరోగ్యం తో ముడిపడిన అంశం కావటంతో ప్రభుత్వం దీని పైన ఇంతలా పట్టుదలకు పోతూ..సాగదీయటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంత్రులు సీఎం మెప్పు కోసం మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే, చివరకు ఈ నిర్ణయాలు ఇమేజ్ పెంచినా..డామేజ్ జరిగినా ఆ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోనే పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+