డిపాజిట్లతో అక్షయ్ గోల్డ్ కుచ్చుటోపీ: ఆస్తుల జప్తునకు ఆదేశం

దాదాపు వివిధ బ్యాంకుల్లో ఉన్న 10.15 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 484 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 1009 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 439 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 316.25 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 106.67 ఎకరాలను గుర్తించి అటాచ్ చేయాలని ప్రభుత్వం సిఐడికి ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 2354.92 ఎకరాల భూమిని అటాచ్ చేసేందుకు ఆంధ్రప్రభుత్వం సిఐడికి అనుమతి ఇచ్చింది. 10.15 కోట్ల రూపాయల సొమ్ము వివరాలను విశే్లషిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోల 26 ఎస్బిఐ బ్రాంచీలు, 33 ఎస్బిహెచ్ బ్రాంచీలు, 95 యాక్సిస్ బ్యాంకు బ్రాంచీలు, 38 హెచ్డిఎఫ్సి బ్రాంచీల్లో ఈ నగదు నిల్వలు ఉన్నట్లు సిఐడి కనుగొంది. ఈ కేసులో మొత్తం 26 మంది నిందితులు ఉన్నారని పేర్కొన్నారు.
డిపాజిట్లను వసూలు చేసి 20 శాతం వడ్డీ ఇస్తామని ఈ సంస్ధ మోసం చేసిందని అభియోగం మోపారు. అలాగే డిపాజిటర్కు స్ధలం కూడా ఇస్తామని కూడా అక్షయగోల్డ్ ఫార్మ్స్, విల్లాస్ ఇండియా లిమిటెడ్ ప్రజలకు హామీ ఇచ్చింది మోసం చేసిందని సిఐడి పేర్కొంది. ఈ కేసు ఒంగోలు ఒకటవ పోలీసు స్టేషన్లో నమోదు కాగా, సిఐడికి బదలాయించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications