నేపాల్ వరదల్లో ఏపీ వాసులు- ఢిల్లీలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్- నంబర్లివే..!
నేపాల్ లో నిన్న ఆకస్మికంగా విరుచుకుపడ్డ వరదల ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. దీంతో భారత్ కు చెందిన వందలాది మంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. అలాగే ఏపీకి చెందిన వారు కూడా నేపాల్లో గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) వారిని ఆదుకునేందుకు, వారి కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
నేపాల్ వరదల్లో (Nepal Floods) ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే అంశంపై సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికారులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటైంది.

ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లను ప్రభుత్వం వెల్లడించింది. ఫోన్ చేసేందుకు 011-23384016 011-23387089 నంబర్లు, వాట్పాప్ చేసేందుకు 9059824101 నంబర్ ను విడుదల చేసింది. ఏపీ నుంచి నేపాల్ కు వెళ్లి చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణతో బాధిత యాత్రికులకు సహకారం అందించాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు.














Click it and Unblock the Notifications