ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. రేపు (బుధవారం) నుంచే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా 1.04 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఈ హామీ అమలు ద్వారా మరింత మందికి ప్రయోజనం దక్కనుంది.
ఏపీ ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీ అమలుకు సిద్దమైంది. చేనేతలకు 'పవర్' గిఫ్ట్ ప్రకటిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. దీంతో, ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు ప్రభుత్వం చేయనుండగా.. 1,04,488 చేనేత కుటుంబా లకు లబ్ధి కలనుంది. దీంతో.. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్లైందని కూటమి నేతలు చెబుతున్నారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఉచిత విద్యుత్ వల్ల 93 వేల మగ్గాలు, 10,534 మర మగ్గాలతో కలిపి 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

చేనేతలకు అండగా ప్రభుత్వం
తాజాగా ఈ పథకం అమలు ద్వారా మగ్గానికి నెలకు రూ.720, ఏడాదికి రూ.8,640, మర మగ్గాల నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 లబ్ధి కలుగుతుందని అధికారులు వివరించారు. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. ఆప్కోలో రెడీమేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి పెరిగిందని, ఈ-కామర్స్ ద్వారా చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామని వివరించారు. చేనేతల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వారికి అవస మైన రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్కెటింగ్ వంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారని అధికారులు వివరించారు.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!!











Click it and Unblock the Notifications