వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం: ఏపీ హర్షం, బాబు ప్రచారంతో నష్టమని బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

AP leaders happy with Polavaram Bill
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మూడేళ్లలో కేంద్రం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి కోరారు. రాజ్యసభలో పోలవరం బిల్లు ఆమోదం పొందడం పైన ఆంధ్రప్రదేశ్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నిర్వాసితులైన గిరిజనులందరికీ కేంద్రమే పునరావాసం కల్పించాలని రఘువీరా అన్నారు.

మీ ప్రచారంతో రాష్ట్రానికి నష్టం: బొత్స

అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం వల్ల రాష్ట్రానికి నష్టమని, వచ్చే పెట్టుబడులు రావని, పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందని చెప్పుకోదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ కారణంగా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందంటూ విమర్శిస్తున్నారని చెప్పారు.

ఇప్పటికీ రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వడం లేదని, రైతులకు కొత్త రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తాము వాస్తవ పత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. సభ్యులంతా హాలులోకి వచ్చాక.. కోరం లేదంటూ నెల్లూరు జడ్పీ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయడమేమిటని ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh leaders happy with Polavaram Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X