సుదీర్ఘ నిరీక్షణకు తెర.. నేడు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా..!
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఇప్పటికే నిర్వహించిన మెగా డీఎస్సీ-2025కి సంబంధించి తుది ఎంపిక జాబితాను ఈరోజు ( సెప్టెంబర్ 15, 2025 ) విడుదల చేయనున్నారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. వీటిలో సుమారు 16,000 పోస్టులు భర్తీ చేశారు. కొన్ని మేనేజ్మెంట్లు, పలు సామాజిక వర్గాల్లో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 300కు పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
అయితే మొదట 600కు పైగా ఖాళీలు మిగిలే పరిస్థితి ఉండగా, వీలైనన్ని ఎక్కువ పోస్టులను భర్తీ చేయడానికి ఏడు విడతలుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. మిగిలిన పోస్టులను తదుపరి డీఎస్సీలో భర్తీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తుది ఎంపిక జాబితాను జిల్లా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాలు, అధికారిక వెబ్సైట్ cse.apcfss.in లో అందుబాటులో ఉంచనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.

నియామక పత్రాల పంపిణీ..
ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలోని సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అంతే కాకుండా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం దసరా సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున.. వీరందరినీ విధుల్లోకి నియమించాలనే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.
డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదల అయ్యింది. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఆగస్టు 1న తుది కీ ప్రకటించారు. అభ్యర్ధుల ఎంపికలో TET మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. ఇక అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువపత్రాల పరిశీలనను 7 విడతల్లో పూర్తి చేశారు.
కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల నియామకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు గణనీయంగా తగ్గనున్నాయి. దీంతో విద్యార్థుల చదువులో నాణ్యత పెరుగుతుందని, గ్రామీణ పాఠశాలల్లో ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications