'సిట్‌'కు ఆధారాలను సమర్పించిన మంత్రి అయ్యన్నపాత్రుడు

విశాఖలో భూ రికార్డుల తారుమారు వ్యవహరంపై ఏర్పాటుచేసిన సిట్ అధికారుల కమిటీని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నాడు కలిశారు.

విశాఖపట్టణం: విశాఖలో భూ రికార్డుల తారుమారు వ్యవహరంపై ఏర్పాటుచేసిన సిట్ అధికారుల కమిటీని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నాడు కలిశారు. ఈ నెల 19న, మరోసారి ఆయన కలవనున్నారు.

సిట్ అధికారులకు భూ కుంభకోణాలపై ఫిర్యాదులను ఇచ్చారు. ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.180కోట్లు రుణాలను పొందిన విషయాన్ని ఆయన సిట్‌కు వివరించారు.

Ap minister Ayyannapatrudu submitts to SIT complaints against vishaka land scams.

పెదగంట్యాడ మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వం స్థలాన్నే కబ్జాచేసి స్వంత భూమి అని నమ్మించి కోట్లాది రూపాయాలను పరిహరం పొందరాని బడాబాబుల వ్యవహరాన్ని మంత్రి సిట్‌కు అందజేశారు.

ఈ కుంభకోణాన్ని 2015లోనే గుర్తించి మంత్రి హోదాలోనే చెల్లింపులు ఆపాలని లేఖ రాసినా చెల్లింపులను ఆపలేదన్నారు. మరోమారు ఈ నెల 19న, సిట్ అధికారులను కలిసి మరిన్ని ఆధారాలను సమర్పించనున్నట్టు ఆయన చెప్పారు.

విశాఖ భూకుంభకోణానికి సంబంధించిన మంత్రి అయ్యన్నపాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. ఈ విషయమై ఇదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+