'సిట్'కు ఆధారాలను సమర్పించిన మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖలో భూ రికార్డుల తారుమారు వ్యవహరంపై ఏర్పాటుచేసిన సిట్ అధికారుల కమిటీని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నాడు కలిశారు.
విశాఖపట్టణం: విశాఖలో భూ రికార్డుల తారుమారు వ్యవహరంపై ఏర్పాటుచేసిన సిట్ అధికారుల కమిటీని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నాడు కలిశారు. ఈ నెల 19న, మరోసారి ఆయన కలవనున్నారు.
సిట్ అధికారులకు భూ కుంభకోణాలపై ఫిర్యాదులను ఇచ్చారు. ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.180కోట్లు రుణాలను పొందిన విషయాన్ని ఆయన సిట్కు వివరించారు.

పెదగంట్యాడ మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వం స్థలాన్నే కబ్జాచేసి స్వంత భూమి అని నమ్మించి కోట్లాది రూపాయాలను పరిహరం పొందరాని బడాబాబుల వ్యవహరాన్ని మంత్రి సిట్కు అందజేశారు.
ఈ కుంభకోణాన్ని 2015లోనే గుర్తించి మంత్రి హోదాలోనే చెల్లింపులు ఆపాలని లేఖ రాసినా చెల్లింపులను ఆపలేదన్నారు. మరోమారు ఈ నెల 19న, సిట్ అధికారులను కలిసి మరిన్ని ఆధారాలను సమర్పించనున్నట్టు ఆయన చెప్పారు.
విశాఖ భూకుంభకోణానికి సంబంధించిన మంత్రి అయ్యన్నపాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. ఈ విషయమై ఇదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడ రాశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications