ఏపీలో మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల వార్ వన్సైడ్గా ముగిసింది. జగన్ దండయాత్ర మరోసారి కొనసాగింది. ఇక బేరాల్లేవమ్మా అంటూ వైసీపీ మొత్తం 11 కార్పొరేషన్లను కొల్లగొట్టింది. ఇక టీడీపీ కథ కంచికి చేరినట్లయ్యింది. విజయవాడ కార్పొరేషన్, విశాఖ కార్పొరేషన్ పై ఆశలు పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లకు శృంగభంగమే మిగిలింది. ఆదివారం రోజున కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వైసీపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఎక్కడా టీడీపీకి అవకాశం లేదు. రాయలసీమలో పట్టును వైసీపీ కొనసాగించింది.
మున్సిపాలిటీ విషయానికొస్తే ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగురగా... కడప జిల్లా మైదుకూరులో ఒక సీటు ఎక్కువగా టీడీపీ నెగ్గింది. మైదుకూరులో మొత్తం 25 వార్డులు ఉండగా...టీడీపీ 12 వార్డులు వైసీపీ 11వార్డులు ఇతరులు 1 వార్డు గెలిచాయి. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లతో మైదుకూరు మున్సిపాలిటీ కూడా సాంకేతికంగా వైసీపీ ఖాతాలో పడతాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓటు, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామిరెడ్డిల ఓట్లు వైసీపీకి వెళతాయి కాబట్టి ఇక్కడ మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఫ్యాన్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.తాడిపత్రిలో కూడా అద్భుతం జరిగే అవకాశాలుంటే తప్ప సీటు వైసీపీ ఖాతాలో చేరదు.
మొత్తానికి ఎన్నో అవాంతరాలు, కోర్టు తలపులను తట్టి చివరాఖరకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. అయితే గుంటూరు, విశాఖ, విజయవాడలో కూడా వైసీపీ కైవసం చేసుకోవడంతో ఇక రాజధాని తరలింపునకు ప్రజామోదం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా పెద్దగా ప్రభావం చూపలేదని.. కేవలం సంక్షేమం, అభివృద్ధి మంత్రాలే వైసీపీని విజయతీరాలకు చేర్చాయని వైసీపీ ముఖ్యనాయకులు చెబుతున్నారు.
Mar 14, 2021, 5:20 pm IST
ప్రజలు అభివృద్ధికి ఓటువేశారు..విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను చంద్రబాబు వ్యతిరేకించారు: విజయసాయిరెడ్డి
Mar 14, 2021, 4:47 pm IST
యలమంచిలి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైసీపీ
Mar 14, 2021, 4:42 pm IST
మున్సిపల్ ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇంత ఘోరంగా ఓటమి చెంది ఉండకూడదు. గ్రూపు తగాదాలే ఓటమికి కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలుస్తాం: బుద్ధా వెంకన్న
Mar 14, 2021, 4:41 pm IST
మున్సిపల్ ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు: లక్ష్మీ పార్వతి
Mar 14, 2021, 3:11 pm IST
పరిపాలన రాజధానిగా విశాఖపట్నంకు ప్రజలు ఆమోదం తెలిపారని చెప్పేందుకు గుంటూరు, విజయవాడ, విశాఖ ఫలితాలే నిదర్శనం: విజయసాయిరెడ్డి
Mar 14, 2021, 3:10 pm IST
అమలాపురం మున్సిపాలిటీ వైసీపీ కైవసం
Mar 14, 2021, 3:08 pm IST
విశాఖలో 55 చోట్ల వైసీపీ ముందంజ..టీడీపీ 29 చోట్ల, బీజేపీ జనసేన పార్టీలు 5 చోట్లలో ముందంజ
విశాఖలో 78వ డివిజన్లో సీపీఎం అభ్యర్థి గంగారాం గెలుపు.72వ డివిజన్లో సీపీఐ అభ్యర్థి స్టాలిన్ విజయం. ఈ రెండు డివిజన్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నాయి
Mar 14, 2021, 12:21 pm IST
విజయవాడ
విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం
Mar 14, 2021, 12:17 pm IST
అనంతపురం జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ వైసీపీ కైవసం
Mar 14, 2021, 12:15 pm IST
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే విజయం దక్కిందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం: మంత్రి ఆళ్ల నాని
Mar 14, 2021, 11:58 am IST
చిత్తూరు
నగరి మున్సిపాలిటీ వైసీపీ కైవసం
READ MORE
9:07 AM, 14 Mar
ఏపీలో కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
9:07 AM, 14 Mar
ఉదయం 11 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం
9:09 AM, 14 Mar
మొత్తం 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు జరుగుతోన్న కౌంటింగ్
9:09 AM, 14 Mar
ఏలూరు కార్పొరేషన్ ఫలితాలకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్
9:10 AM, 14 Mar
చిలకలూరిపేట ఓట్లు లెక్కింపు జరుగుతుంది కానీ కోర్టు ఆదేశాల తర్వాతే ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది
9:12 AM, 14 Mar
విశాఖ 11వ వార్డు జనసేన అభ్యర్థి బోను భారతి గుండెపోటుతో మృతి
9:14 AM, 14 Mar
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కొనసాగుతోన్న పోలింగ్. ఉభయగోదావరి-కృష్ణా-గుంటూరు జిల్లాల్లో పోలింగ్. సాయంత్రం నాలుగు గంటలవరకు కొనసాగనున్న పోలింగ్
9:15 AM, 14 Mar
నాయుడుపేట
నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో రెండు స్థానాల్లో వైసీపీ విజయం. నాయుడుపేట మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు
9:17 AM, 14 Mar
ఇప్పటికే 23 వార్డులు ఏకగ్రీవం. అంటే వైసీపీ 21, టీడీపీ 1, బీజేపీ 1 గెలుపు
9:30 AM, 14 Mar
గిద్దలూరు
గిద్దలూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు. ఇప్పటికే 7 వార్డులు వైసీపీ ఏకగ్రీవం కాగా ఈ రోజు 13 వార్డులకు కౌంటింగ్. వైసీపీకి 5 వార్డుల్లో విజయం టీడీపీ ఒక వార్డులో గెలుపు
9:32 AM, 14 Mar
ప్రకాశం జిల్లా కనిగిరి మునిసిపాలిటీ వైసీపీ కైవసం
9:32 AM, 14 Mar
నెల్లూరు
సుళ్లూరుపేట మున్సిపాలిటీలో వైసీపీ విజయం
9:37 AM, 14 Mar
ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ హవా. గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైసీపీ
9:45 AM, 14 Mar
విజయవాడపై ఆశలు పెట్టుకున్న టీడీపీ
9:48 AM, 14 Mar
వైసీపీ ఖాతాలో 15 మున్సిపాలిటీలు
9:52 AM, 14 Mar
నగరి
నగరి నియోజకవర్గంలో పోటీ హోరాహోరీ. నగరి నియోజకవర్గంలో పుత్తూరు నగిరి మున్సిపాలిటీలు
10:05 AM, 14 Mar
గుంటూరు
ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్. రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా వైఎస్సార్సీపీ, టీడీపీ. స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు. తొలి ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి.
10:08 AM, 14 Mar
తూర్పు గోదావరి
కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మెరుగుపడిన జనసేన. అమలాపురం మునిసిపాలిటీలో మూడువార్డుల్లో ఆధిక్యతలో జనసేన పార్టీ అభ్యర్థులు. వెనుకంజలో వైసీపీ
10:25 AM, 14 Mar
పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ విజయం. జంగారెడ్డి గూడెంలో ఆధిక్యతలో అధికార పార్టీ
10:27 AM, 14 Mar
ప్రకాశం
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం. మొత్తం 35 వార్డుల్లో 17 చోట్ల విజయం సాధించిన వైసీపీ అభ్యర్థులు. ఒక్క వార్డులో టీడీపీ గెలుపు.
10:36 AM, 14 Mar
అనంతపురం
అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో 12 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ. మొత్తం 40 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో టీడీపీ, ఇతర పార్టీలేవీ ఇంకా ఖాతా తెరవలేదు.
10:39 AM, 14 Mar
నెల్లూరు
నెల్లూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సాగుతోన్న వైఎస్సార్సీపీ. దాదాపు అన్ని వార్డుల్లోనూ ఆధిక్యతలో ఉన్న వైసీపీ అభ్యర్థులు
10:49 AM, 14 Mar
అనంతపురం
అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీలో ఆధిక్యతలో దూసుకెళ్తోన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు. అయిదు వార్డుల్లో వైసీపీ, నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో తొమ్మిది వార్డుల్లో వైసీపీ ఆధిక్యతలో కొనసాగుతోంది.
10:50 AM, 14 Mar
గుంటూరు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు 25 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
10:57 AM, 14 Mar
ఏపీలో 30 మున్సిపాలిటీల్లో వైసీపీ గెలుపు
11:05 AM, 14 Mar
సత్తెనపల్లి 8వ వార్డులో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి
11:06 AM, 14 Mar
అనంతపురం
అనంతపురం జిల్లాలో మడకశిర, గుత్తి, ధర్మవరంలలో వైసీీపీ విజయం