వాషింగ్టన్ లో సీఎం జగన్ కు ప్రవాసాంధ్రుల స్వాగతం : జై జగన్ నినాదాలతో ఆహ్వానం (వీడియో)...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్ కు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. అధికారిక..వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన జగన్ పూర్తిగా సొంత ఖర్చులతో పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు..అధికారులతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం జగన్ తో ఉన్నారు. భారత రాయబారి ముఖ్యమంత్రిని విందుకు ఆహ్వానించారు. అక్కడి ప్రవాసాంధ్రులతోనూ జగన్ సమావేశం కానున్నారు. అదే విధంగా తన రెండో కుమార్తె ను యూనివర్సిటీ చేర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. 17న డల్లాస్ లో ప్రవసాంధ్రులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు.

వాషింగ్టన్ లో జగన్ కు అపూర్వ స్వాగతం..
కుటుంబ సభ్యులు..అధికారులతో కలిసి అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కు వాషింగ్టన్ డీసీ విమానాశ్రమంలో ఘన స్వాగతం లభించింది. ప్రవాసాంధ్రులు ఆయనకు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా(ఐఏఎస్), నీల్కాంత్ అవ్హద్(ఐఏఎస్) కూడా సీఎం జగన్ను సాదరంగా ఆహ్వానించారు. అమెరికా కాల మానం ప్రకారం ఈ ఉదయం 8.30 గంటలకు జగన్ అమెరికా చేరుకున్నారు. అదే భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం ఆరు గంటలకు ఆయన అక్కడికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ ను భారత రాయబారి విందు కు ఆహ్వానించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. ఈ పర్యటనలో అమెరికాలోని ప్రముఖులతోనూ జగన్ సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. అమెరికా చేరుకున్న జగన్ కు అక్కడి ప్రవాసాంధ్రులతో పాటుగా వైసీపీ అభిమానులు జై జగన్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు.

డల్లాస్ మీటింగ్ పైన జగన్ షరతు ఇలా..
అమెరికాలో కొన్ని సంఘాల వారీగా ప్రవాసాంధ్రులు సమావేశాలు కొనసాగిస్తున్నారుద. జగన్ ను డల్లాస్ జరిగే సమావేశంలో పాల్గొనాలని అక్కడి ప్రవాసాంధ్రులు ఆహ్వానించగా..అందరూ ఒక్కటిగా తెలుగు వారంతా హాజరైతేనే తాను కార్యక్రమంలో పాల్గొంటానని జగన్ స్పష్టం చేసారు. దీంతో..తానా, ఆటా, తెలుగు సమాఖ్య, ఏపీఎన్నార్టీ వంటి సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఈ సమావేశం ఏర్పాటు చేసారు. డల్లాస్ లో జరిగే ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలు పాల్గొంటున్నారు. ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో తెలుగు వారు భారీ సంఖ్యలో పాల్గొనే ఈ సమావేశంలో జగన్ ఎటువంటి సందేశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అదే సమయంలో వైసీపీ ఎన్నారై విభాగం.. జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు ఈ సమావేశ బాధ్యతను స్వీకరించారు.

అమెరికాలో జగన్ కార్యక్రమం ఇలా...
ముఖ్యమంత్రి జగన్ డల్లాస్ కార్యక్రమం పూర్తి చేసుకున్న తరువాత కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు. తన రెండో కుమార్తెను అక్కడి యూనివర్సిటీలో చేర్పించేందకు ఇప్పటికే జగన్ తో పాటుగా కుటుంబ సభ్యులు సైతం అమెరికా చేరుకున్నారు.
ఇక, ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు వాణిజ్య ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు. 23న ముఖ్యమంత్రి స్వదేశానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తో పాటుగా ఎంపీలు అవినాశ్ రెడ్డి..మిధున్ రెడ్డి..భరత్ అదే విధంగా మంత్రి సురేష్.. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక, అమెరికాలో ముఖ్యమంత్రి పర్యటన పైన ఇప్పుడు పార్టీలో ఆసక్తి నెలకొని ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications