అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.. ఏపీ ఏకంగా 25.3 శాతం వాటా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పెట్టుబడులపై ఫుల్ ఫోకస్ చేసింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం ఉపయోగపడేలా కృషి చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగానే పెట్టుబడుల వరద పారింది ఏపీలో. మీరి ముఖ్యంగా ఇది 2026 ప్రారంభానికి అద్భుతమైన జోష్ ఇచ్చింది. ఈ విషయాన్నే ప్రపంచంలోనే ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన బిజినెస్ ఎడిషన్ లో ప్రచురించింది.
2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏపీ పెట్టుబడులను అనిర్వచనీయ రీతిలో ఆకర్షించింది. 2025 ఏప్రిల్-డిసెంబర్ వరకు భారతదేశ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో పావలా శాతం ఏపీనే రాబట్టుకోవడం గమనార్హం. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఆర్ధిక నివేదికలో వెల్లడించిన విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
51.2 శాతం వాటా..
ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 2025 ఏప్రిల్-డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్లు పెట్టుబడులకు ప్రతిపాదనలు జరిగాయి. ఇందులో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఒడిశా 13.1 శాతం పెట్టుబడులకు తమ రాష్ట్రానికి తీసుకెళ్లింది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై 12.8 శాతం పెట్టుబడ్డులు దక్కించుకుంది. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో సగానికిపైగా అంటే 51.2 శాతం వాటాలను ఈ మూడు రాష్ట్రాలే ఆకర్షించాయి. అందులో 25 శాతం వాటా ఏపీకే రావడం సంతోషకరమైన పరిణామంగా చంద్రబాబు పేర్కొన్నారు.

ముగింపు కాదు, నిరంతర పురోగతికి బాటలు..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. తన ఆనందాన్ని పంచుకున్నారు. "ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో శుభవార్త. ఈ ఏడాదికి ఒక గొప్ప ఆరంభం. మన ముందుచూపుతో తీసుకున్న విధానపరమైన సంస్కరణలు, ముఖ్యంగా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవలు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో అనే దానికి ఇదే నిదర్శనం. ఇందులో భాగంగా, ప్రోత్సాహకాలను సకాలంలో పారదర్శకంగా పంపిణీ చేయడం కోసం ప్రవేశపెట్టిన 'ఎస్క్రో ఆధారిత యంత్రాంగం' ప్రవేశపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి తమ గమ్యస్థానంగా ఎంచుకుంది. మా దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు పెట్టుబడిదారులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగ నిబద్ధతను, కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ మైలురాయి ముగింపు కాదు, నిరంతర పురోగతికి ఇది ఒక పునాది. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి, భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, స్థిరమైన వృద్ధిని అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము" అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
This is welcome news for the people of Andhra Pradesh and a strong start to the year. It reflects the impact of our forward-looking policy reforms, particularly the Speed of Doing Business initiatives, including the introducing the concept of an escrow-based mechanism for timely… pic.twitter.com/7mpniHuQCX
— N Chandrababu Naidu (@ncbn) January 3, 2026












Click it and Unblock the Notifications