Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM Chandrababu: చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేశా

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ భేటీలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపంది రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు. గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. ఈ సందర్భంగా సీఎం మంత్రులను అభినందించారు. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని... అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని సూచించారు.

ఏపీ సచివాలయంలో జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు. హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... "2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశాం... ఫలితాలు వచ్చాయి." అని కితాబిచ్చారు.

AP SIPB Approves Major Investment Projects as CM Chandrababu Naidu Calls for Faster Governance

విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం.

విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని.. ఫలితంగా రూ. 4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్న సీఎం.. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని పునరుద్ఘాటించారు.

విద్యుత్ రంగంతోపాటు... వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం... విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగామన్నారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని కొనియాడారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని.. ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి కోరారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని మంత్రులను సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+