రైతుల కోసం కేబినెట్ కీలక నిర్ణయాలు, తొలి సారిగా..!!
రైతు అంశాల పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు (గురువారం) జరిగే కేబినెట్ లో భేటీలో ప్రధానంగా మెట్రో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేకోవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సీజన్, ఖరీఫ్ సాగు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి తీసుకువచ్చే విషయంపైన చర్చించనున్నారు.
తెలంగాణ మంత్రివర్గం కీలక అంశాల పైన చర్చించి.. నిర్ణయాలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా ఈ రోజు జరిగే భేటీలో పలు అంశాల పైన చర్చించనున్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించాల్సిన తీరుపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వందశాతం నిధులు కేంద్రమే భరించాలని, కొత్త పథకం అమలును కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సీజన్లో తప్పనిసరిగా 60 రోజులపాటు పనులు నిలిపివేయాలనే నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనిపై కూడా చర్చించి.. కేంద్రానికి ప్రతిపాదన చేయనున్నట్లు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని కీలకాంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మంత్రులతో రేవంత్ కీలక చర్చలు.. నిర్ణయాలు
అదే విధంగా వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన చర్యలతో పాటు ..ధాన్యం కొనుగోళ్లు హైదరాబాద్ మెట్రో రైలు, వీబీజీ రామ్జీ పథకం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలపై సీఎం మంత్రులు సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం నుంచి స్పందన రానందున ఎలాముందుకెళ్లాలో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ వల్ల అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అధికారులు లేకుండా అనధికారికంగా సీఎం, మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. వ్యవసాయ కమిషన్ సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సాగు చేసేలా రైతులని ప్రోత్సహించేలా కార్యక్రమాలకు ప్రణాళిక ఖరారు చేయనున్నారు.













Click it and Unblock the Notifications