'మంత్రులకు కంప్యూటర్ ఉపయోగించడం వచ్చా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం మండిపడ్డారు. టీడీపీ సైట్ నుండి రుణమాఫీ తదితర అంశాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. రాజధాని, పోలవరం వంటి కీలక నిర్ణయాలలో పార్టీల సలహాలు తీసుకోలేదన్నారు.
పార్టీల సలహాలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. ట్రాన్స్ట్రాయ్కు రూ.200 కోట్ల చెల్లింపులో పారదర్శకత లేదని విమర్శించారు. ట్రాయ్కు చెల్లింపుల నోటును అఖిల పక్షం ముందు పెట్టాలన్నారు. ఈ-కేబినెట్ పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. అసలు ఎంతమంది మంత్రులకు కంప్యూటర్లు ఉపయోగించడం తెలుసో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఏపీసీసీ 30 ప్రశ్నలను సంధించింది.
సౌమ్య ప్రమాణ స్వీకారం
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావు హైదరాబాదులోని తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల దేవినేని ఉమా మహేశ్వర రావు, రావెల కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.